Kadapa Crime : దారుణం.. అక్కను చంపిందని తల్లిని హత్యచేసిన కుమారుడు

కడప నగరంలోని నకాష్ వీధిలో దారుణం జరిగింది. తల్లి కూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు.

Kadapa Crime : దారుణం.. అక్కను చంపిందని తల్లిని హత్యచేసిన కుమారుడు

Guntur Murder

Kadapa Crime : కడప నగరంలోని నకాష్ వీధిలో దారుణం జరిగింది. తల్లి కూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ హుస్సేన్, ఖుర్షీదా (47) భార్య భర్తలు.. వీరికి ఓ పాప, ఓ బాబు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు పిల్లతో కలిసి వేరుగా ఉంటుంది ఖుర్షీదా. ఆమె కూతరు అలీమా(14) తరచుగా ఫోన్ చూస్తుండటంతో అనేక సార్లు మందలించింది. అయినా అలీమా ఫోన్ చూడటం మానలేదు.. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో తల్లి కూతురికి మధ్య గొడవ జరిగింది.

చదవండి : Kadapa : మద్యం మత్తులో జేసీబీ నడిపిన డ్రైవర్.. ముగ్గురు మృతి

అర్ధరాత్రి 2 అయిన కూతురు పడుకోకపోవడంతో తల్లి మందలించింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఖుర్షీదా కోపంతో కూతురు గొంతును చున్నీతో బిగించి హత్య చేసింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు జమీర్ ఇదంతా చూశాడు. తన అక్కను చంపడంతో తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఖుర్షీదా అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చదవండి : Heavy Rains in Kadapa: కడప జిల్లాలో భారీ వర్షాలు