బూడిదతో బాపూజీ బొమ్మ : ఇండియా రికార్డ్స్ గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు

బూడిదతో బాపూజీ బొమ్మ : ఇండియా రికార్డ్స్ గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు

Karnool : Adoni man Gandhi Ash Art : కాగితాలు కాల్చిన బూడిదతో ఓ అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన యువకుడు. కాగితాలు కాల్చిన బూడిదతో భారత జాతి పిత గాంధీజీ బొమ్మ గీసి..లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. కాగితాలు కాల్చిన బూడిదతో తన చేతి మునివేళ్లతో గాంధీ మహాత్ముని చిత్రాన్ని అత్యంత సహజంగా గీసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీకాంత్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు.

ఆదోని పట్టణ పరిధిలోని నారాయణ గుంతకు చెందిన శ్రీ వైష్ణవ శ్రీకాంత్, ఎంబీయే చదివి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగితాలను కాల్చగా వచ్చిన బూడిదతో..తన చేతి మునివేళ్లతో గాంధీజీ బొమ్మ వేశాడు. అదంతా వీడియో తీసి..ఇండియా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులకు పంపించాడు.

దాని మొత్తం పరిశీలించిన రికార్డులు నమోదు చేసే అధికారులు 2021-22 సంవత్సరానికి అత్యుత్తమ ఆర్ట్ గా గుర్తిస్తూ..గోల్డ్ మెడల్ ఇచ్చి అభినందించారు. మెడల్ తో పాటు ప్రశంసా పత్రాన్ని కొరియర్ లో పంపారు. మెడల్ అందుకున్న శ్రీకాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.