ఇంకా లభించని కావ్య ఆచూకీ, ఆందోళనలో తల్లిదండ్రులు
kavya kidnap in chittoor: చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో నిన్న(నవంబర్ 11,2020) కిడ్నాప్కు గురైన పదో తరగతి బాలిక కావ్య ఆచూకీ ఇంకా లభించ లేదు. కావ్య మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మధుకర్ రెడ్డి అనే దగ్గరి బంధువు, మరో స్నేహితుడు కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.