కాంగ్రెస్‌కు మరో షాక్ : కిషోర్ చంద్రదేవ్ గుడ్ బై

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు.

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 03:52 PM IST
కాంగ్రెస్‌కు మరో షాక్ : కిషోర్ చంద్రదేవ్ గుడ్ బై

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు.

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు. ఏ పార్టీలో చేరేది అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి భవిష్యత్ లేదని.. కాంగ్రెస్‌ రూపొందించిన విభజన చట్టంలో లోపాలున్నాయన్నారు. అందుకే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. ఇక బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని.. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలో చేరనని స్పష్టం చేశారు.

 

* కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా
* రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు
* కాంగ్రెస్‌ రూపొందించిన విభజన చట్టంలో లోపాలు
* బీజేపీ రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది