Kodali Nani : తండ్రిని చంపిన వారితో షోలా? సిగ్గుందా.. బాలకృష్ణ, చంద్రబాబు షోపై కొడాలి నాని ఫైర్

తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షోల పేరుతో అల్లుడు, కొడుకు.. ఎన్టీఆర్ ని ఇంకా హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు.

Kodali Nani : తండ్రిని చంపిన వారితో షోలా? సిగ్గుందా.. బాలకృష్ణ, చంద్రబాబు షోపై కొడాలి నాని ఫైర్

Kodali Nani : చంద్రబాబు, బాలకృష్ణపై మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షోల పేరుతో అల్లుడు, కొడుకు.. ఎన్టీఆర్ ని ఇంకా హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబు అనేకసార్లు గతిలేక ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని నాని చెప్పారు.

చంద్రబాబు ఒక 420. ఎన్టీఆర్ కాళ్ల దగ్గరే ఉండి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఎన్టీఆర్ పార్టీని నువ్వు కాపాడేదేంటి? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న గజదొంగ చంద్రబాబు. ముమ్మాటికి ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ, దేవుడు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని క్షమించరు.

బాలయ్యకు సిగ్గు, శరం లేదు. నీ తండ్రికి ద్రోహం చేసిన వ్యక్తి కొడుక్కి నీ పిల్లని ఇస్తావ్. మళ్లీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి షోలో పెడతావ్. ఇద్దరూ కలిసి ఈ రాష్ట్ర ప్రజల కళ్లు కప్పాలని ప్రయత్నం చేశారు. సిగ్గు లేదూ. చంద్రబాబుకి బుద్ది లేదు. బాలయ్యకు ఏమైంది?

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నటనలో ఎన్టీఆర్ ను మించిపోయాడు చంద్రబాబు. ఎన్టీఆర్ ను పొడిచి ముఖ్యమంత్రి అయినందుకు చంద్రబాబుకు బాధేసిందా? రామారావు తప్పు చేశారు, నేను ఏ తప్పూ చేయలేదు. రామారావు కాళ్లు పట్టుకున్నా ఆయన కనికరించకుండా తప్పులు చేస్తున్నాడు, అందుకే నేను పార్టీ కాపాడా అని చంద్రబాబు చెప్పడం దారుణం.

అసలు చంద్రబాబు ఎవరు? పార్టీని కాపాడటానికి. చంద్రబాబు బయటకెళ్లి పార్టీ పెట్టుకోవాల్సింది. నిన్ను నమ్మితే నీతో పాటు వచ్చేవారు. చంద్రబాబు విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ, ఆయన కులానికి కానీ నాయకుడెవరూ లేరు కాబట్టి..చంద్రబాబు ఏసుకుని ఊరేగుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు, ఆ కులం వారు మిగిలించి మిగతా ప్రజానీకం అంతా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబుకి రాజకీయ సన్యాసం చేయాలి” అని ప్రజలను కోరారు కొడాలి నాని.

కాగా.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్‌’. ఈ కార్యక్రమం రెండో సీజన్​లో భాగంగా అక్టోబర్​ 14న తొలి ఎపిసోడ్​ టెలికాస్ట్ కానుంది. కాగా, తొలి ఎసిపోడ్ లో బాలకృష్ణ బావ, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సందడి చేశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో విశేషాలు పంచుకున్నారు చంద్రబాబు. బిజీ రాజకీయాలతో నిత్యం సీరియస్ గా ఉండే చంద్రబాబు.. ఈ షో లో సరదా మాటలతో నవ్వులు పంచారు. ఇప్పుడీ షో ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. బాలకృష్ణ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.