Kodali Nani Warns Purandeswari : పిచ్చి పనులు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు.. పురంధేశ్వరికి కొడాలి నాని వార్నింగ్

నాలుగు పెట్రోల్ బంకుల వాళ్ల కోసం, నాలుగు షాపుల వాళ్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం. పురంధేశ్వరి ఓసారి ఆలోచించుకోవాలి.

Kodali Nani Warns Purandeswari : పిచ్చి పనులు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు.. పురంధేశ్వరికి కొడాలి నాని వార్నింగ్

Kodali Nani Warns Purandeswari

Kodali Nani Warns Purandeswari : బీజేపీ నేత పురంధేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పురంధేశ్వరి కృష్నా జిల్లా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. దివంగత ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిథ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. గుడివాడలో ఆర్వోబీల (రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు) నిర్మాణాన్ని నిలిపివేయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు మేలు చేసేందుకు పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కొడాలి నాని. రైళ్ల రాకపోకలను స్తంభింపజేస్తామన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసే ప్రయత్నాలను పురంధేశ్వరి మానుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.

”రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ల నిర్మాణాలను అడ్డుకోవడం ఎన్టీఆర్ కూతురిగా పురంధేశ్వరికి తగదు. నిర్మాణాలను అడ్డుకుంటే రైళ్ల రాకపోకలను స్తంభింపజేస్తాం. చెడగొట్టే కార్యక్రమంలో పురంధేశ్వరి పాలు పంచుకోకూడదు. నితిన్ గడ్కరీని కలిసి వాటిని ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ గుడివాడలో రైళ్లు తిరగడానికి లేకుండా రైల్ రోకో చేస్తాం. ఇక్కడ టెంట్ వేసి బీజేపీ, టీడీపీ దిగొచ్చి ఫ్లై ఓవర్లను మళ్లీ శాంక్షన్ చేసే విధంగా చేస్తాం. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్ ను పురంధేశ్వరి తీసుకున్నారు.

ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధేశ్వరి.. రెండు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలను విరమించుకోవాలి. నాలుగు పెట్రోల్ బంకుల వాళ్ల కోసం, నాలుగు షాపుల వాళ్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం. పురంధేశ్వరి ఓసారి ఆలోచించుకోవాలి. రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా చేశారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇప్పుడు బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Minister Kodali Nani : ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని

ఒక పార్టీ ప్రయోజనాల కోసం, నలుగురు వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇంతమంది ప్రజలను గాలికి వదిలేయొచ్చా? పురంధేశ్వరి ఆలోచించుకోవాలి. గుడివాడ వచ్చి మీటింగ్ పెట్టమనండి. ఆ ఫ్లైఓవర్లు అవసరం లేదని ఓ పది మంది వచ్చి చెబితే మీరు క్యాన్సిల్ చేయించండి. మీరు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని పనికిమాలిన వాళ్లు వచ్చి మిమ్మల్ని కలిస్తే వాళ్ల తరుఫున మీరు గడ్కరీని కలిసి నిర్మాణాలను క్యాన్సిల్ చేయించడానికి ప్రయత్నిస్తున్నారంటే.. ఈ గుడివాడ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలూ మిమ్మల్ని క్షమించరు” అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఒకవేళ ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం ఆగిపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొడాలి నాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని.. ఇక్కడే టెంట్ వేసి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

ఈ విషయమై దగ్గుబాటి పురంధేశ్వరితో మాట్లాడటానికి తాను రెండు సార్లు ప్రయత్నించారని కొడాలి నాని తెలిపారు. అయితే, ఆమె తనకు అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో మీడియా ముఖంగా ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవద్దని దగ్గుబాటి పురంధేశ్వరికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.