చంద్రబాబుకు నోటీసులు.. సెక్షన్-4 కింద కేసు నమోదు
కర్నూల్ జిల్లా వన్టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసు విషయంలో నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కర్నూలులో కరోనా మ్యుటేషన్ ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు అందినట్లు చెప్పుకొచ్చారు ఎస్పీ ఫకీరప్ప. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు పోలీసులు.
చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్షన్ల కింద 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టం సెక్షన్-4 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
టీడీపీ ముఖ్య నేతలతో ఆన్లైన్లో జూమ్లో మాట్లాడుతూ.. ఏపీలో విస్తరిస్తోన్న కరోనా వైరస్ ఇతర వైరస్ల కంటే అత్యంత ప్రమాదకరమైందని అన్నారు. వైరస్ కొత్త మ్యుటేషన్ ఎన్440కే ఏపీలో వ్యాపించిందని చెప్పుకొచ్చారు.