Gun Firing At Ravulapalem: రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. ఫైనాన్స్ వ్యాపారిపై నాటుబాంబులతో దాడికి యత్నం

అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్యరెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనకు కారణాలపై ఆరాతీస్తున్నారు.

Gun Firing At Ravulapalem: రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. ఫైనాన్స్ వ్యాపారిపై నాటుబాంబులతో దాడికి యత్నం

Ravulapalem Gun Firing

Gun Firing At Ravulapalem: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. మిస్ ఫైర్ కావడంతో ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించాడు. దీంతో స్థానికులు అలర్ట్ కావడంతో గన్, ఒక బ్యాగ్ వదిలి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో ఆదిత్య రెడ్డి చేతికి గాయాలయ్యాయి.

Fingerprint Surgeries Crime : హైదరాబాద్‌లో వేలిముద్ర సర్జరీలు చేస్తున్న ముఠా .. డాక్టర్ తో పాటు నలుగురు అరెస్ట్

స్థానిక జాతీయ రహదారి చెంతన రవాణాశాఖ కార్యాలయంపైన నివాసం ఉంటున్నగుడిమెట్ల ఆదిత్యరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో నాటుబాంబులు బ్యాగ్ వదిలేసి దుండగులు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలంలో దుండగులు వదిలి వెళ్లిన బ్యాగులో సెల్ ఫోన్ జామర్ తో పాటు రెండు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

UK PM Results 2022: బ్రిటన్ ప్రధాని ఎవరు? మరికొద్ది గంటల్లో తేలనున్న ఫలితం.. రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు..

ఇదిలాఉంటే.. ఈ కాల్పుల ఘటనకు భూ వివాదమే కారణంగా తెలుస్తోంది. అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన ఇద్దరు వ్యక్తులకు సుమారు తొమ్మిది ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పై ఆదిత్య రెడ్డి తండ్రి గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి రూ.4.70 కోట్లు అప్పు ఇచ్చాడు. అయితే సదరు భూమిలో ఇటీవల 69.50 సెంట్ల భూమిని అమ్మకం చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన వారికి ఆదిత్య రెడ్డి అగ్రిమెంట్ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో స్థల యాజమానులకు ఆదిత్య రెడ్డిలకు మధ్య వివాదం నడుస్తొందని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఈక్రమంలోనే ఆదిత్య రెడ్డిపై కాల్పులు చోటుచేసుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.