ఇక కిక్కే కిక్కు…ఏపీలో 25శాతం పెరిగిన మద్యం ధరలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 09:44 AM IST
ఇక కిక్కే కిక్కు…ఏపీలో 25శాతం పెరిగిన మద్యం ధరలు

మందుబాబులకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మద్యం ధరలను 25శాతం పెంచేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది. పెంచిన ధరలతో ఏపీలో మధ్యం అమ్మకాలను ప్రారంభించనుంది ప్రభుత్వం. వైన్ షాపుల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. 

మిగతారాష్ట్రాలతో పోల్చితే ఇప్పటికే ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. మద్యపానాన్ని నిషేధించే చర్యల్లో భాగంగా…మద్యం తాగేవాళ్ల సంఖ్యను తగ్గించడం,విడతల వారీగా మద్యం షాపుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నట్లు ఏపీ సీఎం గతంలోనే చెప్పారు.

అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా మద్యం ధరలను 25శాతం పెంచడం నిజంగా మందుబాబులకు గట్టి షాక్ అని చెప్పవచ్చు. కాగా మద్యం తాగేవాళ్లను నిరుత్సాహపర్చడం ద్వారా తాగేవాళ్ల సంఖ్యను తగ్గించనున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

కాగా,ఏపీలో ఇవాళ్టి నుంచి డిస్టలరీలు తెరుచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నుండి ముందస్తు అనుమతులు తీసుకుని ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలు అమలు చేస్తూ డిస్టిలరీలు ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.