ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం..దాడిలో మధ్యవర్తి హత్య

  • Published By: murthy ,Published On : June 3, 2020 / 04:54 AM IST
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం..దాడిలో మధ్యవర్తి హత్య

ప్రేమ జంటకు సహకరించిన పాపానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది.  తమ్ముడి ప్రేమను గెలిపించటమే ఆయువకుడు చేసిన నేరం. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం  పేరూరుకు చెందిన  ఓ ప్రేమ జంట ఇటీవల పరారైంది.

వాళ్ళు పారిపోటానికి  అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి  కారణమని భావించిన అమ్మాయి కుటుంబ సభ్యులు అతడితో సహా పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. ప్రవీణ్ కుమార్ పారిపోయిన ప్రేమ జంటలోని యువకుడికి సోదరుడి(పెదనాన్న కొడుకు) వరస అవుతాడు.

పారిపోయిన వారిని తీసుకు రావాలని పోలీసులు ప్రవీణ్ కుమార్ ను కోరారు.  ప్రేమ జంటకోసం పెద్దచింతకుంట వెళ్లిన ప్రవీణ్ పై అమ్మాయి బంధువులు దాడిచేసారు. వాళ్ళ నుంచి తప్పించుకుని బైక్ పై వెళుతుండగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూబగుండ్ల వద్ద మరోసారి అడ్డగించారు.

అక్కడ కూడా మళ్ళీ వెంటాడి వేటాడి కొట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ప్రేమికులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆళ్ళగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ కూడా వేరే మతస్తురాలిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాడు. బాబాయి కొడుకు ప్రేమను గెలిపించే క్రమంలో మృత్యు ఒడికి చేరాడు. 

Read: తల్లి వివాహేతర సంబంధం….తెలుసుకున్న కొడుకు హత్య