love couple commits suicide : పెద్దలు ప్రేమను అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల19న ఓ ప్రేమ జంట రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో పరిసర గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని బలవన్మరణానికి పాల్పడ్డారు.

love couple commits suicide : పెద్దలు ప్రేమను అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్య

Love Couple Suicide

love couple commits suicide in prakasam district  : ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల19న ఓ ప్రేమ జంట రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మరో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో పరిసర గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు వెంకటేశ్వరకాలనీకి చెందిన ఇందు అనే యువతి..హర్షిణి డిగ్రీ కాలేజీలో చదువుకుంటోంది. ఈమె కొప్పోలు కు చెందిన భవనం హర్షవర్ధన్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. హర్షవర్ధన్ రెడ్డి రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవుకుంటున్నాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి వారిని మందలించారు.  దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికులు మంగళవారం ఉదయం టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.