పీకే, సీబీఎన్, లోకేష్ ఇష్టం..ఆ జనసేన కార్యకర్తల మీద ఒట్టు – వర్మ ట్వీట్
పీకే, సీబీఎన్, లోకేష్లను ఎంతగానో ప్రేమిస్తా..కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా..అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఓ పోస్టర్పై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇంతకు ఆ ఫొటోలో ఏముందంటే..శ్రద్ధాంజలి..జోహార్ ద బాస్టర్డ్..అంటూ రాంగోపాల్ వర్మ మరణం 12-12-2019, పెద్దకర్మ 26-12-2019 అంటూ ఉంది.
ఇది జనసేన యూత్ కోడూరు పాడు పేరిట ఉంది. దీనిపై వర్మ స్పందించారు. పీకే, సీబీఎన్, లోకేష్ మద్దతుదారులు, వ్యతిరేకులు..అమ్మరాజ్యంలో సినిమాను అర్థం చేసుకొండి. ఇది కేవలం వినోదం మాత్రమే..అంటూ చెప్పారు.
నిత్యం వివాదాలు, కాంట్రవర్సిలతో వార్తల్లో నిలిచే వ్యక్తి రాంగోపాల్ వర్మ..ఇటీవలే అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా తీశారు. ఈ చిత్రం వివాదాస్పమైంది. అనేక అవాంతరాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. వర్మపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
Read More : కడసారి చూపు కోసం : నివాసానికి గొల్లపూడి భౌతికకాయం
జనసేన యూత్ కోడూరుపేట పేరిట వర్మకు శ్రద్ధాంజలి తెలుపుతూ..బ్యానర్ ఏర్పాటు చేసిన ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై ట్వీట్ చేసిన వర్మకు నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
For all pro pk ,pro cbn ,pro lokesh and anti me ,who are bad mouthing AMMA RAJYAMLO please understand that film is just made for fun and in reality I luv Pk, Cbn and Lokesh and I god promise on their followers and especially on Jana Sena followers from KODOORUPAADU ? pic.twitter.com/qGwPuyMAOK
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2019