ఆస్ట్రేలియాలో తెలుగు వాసి అనుమానాస్పద మృతి, రెండేళ్ల కిందటే వివాహం
Australia : ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్బాబు ఆస్ట్రేలియాలోని అడిలైట్ స్టేట్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హరీష్బాబు మృతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్న హరీష్కు పది నెలల క్రితమే ఓ బాబు పుట్టాడు. కరోనా కారణంగా స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో… హరీష్ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు.
ఇంజనీరింగ్ పూర్తి చేసిన హరీష్ ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కారణంగా హరీష్ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నారు. వ్యాపారాల్లో ఏదో విబేధాలు ఉండడంతో దానిని సెటిల్ మెంట్ చేసుకుని..తర్వాత..వేరే బిజినెస్ పెట్టుకోవాలని తన కొడుకు అనుకున్నట్లు తండ్రి రావి పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇండియా రావాల్సి వస్తుందని..వ్యాపారం చేయకుండా..ఉద్యోగానికి వెళుతున్నాడని తెలిపారు. తన బిడ్డ మృతదేహాన్ని త్వరగా..ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని వేడుకున్నారు. అంతేగాకుండా..దర్యాప్తు చేయాలన్నారు.