live-in Relationship : ఒక మహిళ..ఇద్దరు పురుషుల సహజీవనం.. చివరికి..!
కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్న చేస్తూ ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం చేస్తున్న రోజులు ఇవి. క్షణికమైన ఆనందాల కోసం బంధం పెంచుకోకుండా టైమ్ పాస్ చేస్తున్నారు స్త్రీలు పురుషులు. ఒక మహి
live-in Relationship : కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్న చేస్తూ ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం చేస్తున్న రోజులు ఇవి. క్షణికమైన ఆనందాల కోసం బంధం పెంచుకోకుండా టైమ్ పాస్ చేస్తున్నారు స్త్రీలు పురుషులు. ఒక మహిళ ఇద్దరు పురుషులతో కలిసి జీవిస్తుండంతో వారిలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలం క్రితం ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ ముగ్గురూ ఒకే గదిలో జీవిస్తున్నారు. మూడు రోజుల క్రితం కృష్ణాజిల్లా నందిగామలో ఓ హోటల్ లో పని చేసేందుకు ముగ్గురూ వచ్చారు.
Also Read : Dead Body : ప్రకాశం జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం
ఉష అప్పాజీతో కూడా బాగా చనువుగా ఉంటోంది. అది నచ్చని విజయ్ నిద్రపోతున్న అప్పాజీని గురువారం కత్తితో పీక కోసి హతమార్చాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.