Amaravati Municipal Corporation : అమరావతి కార్పొరేషన్ వద్దు.. మందడం గ్రామ సభ తీర్మానం
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..

Amaravati Municipal Corporation : అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. సీఆర్డీఏను అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజల డిమాండ్ చేశారు. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధానికి భూములు తీసుకునేటప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం 29 గ్రామాలను కలిపి అమరావతి రాజధాని స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా రాజధానిని నిర్వీర్యం చేయడానికే కార్పొరేషన్ ఏర్పాటని గ్రామస్తులు ఆరోపించారు.
Fresh Meat : తాజా మాంసాన్ని గుర్తించటం ఎలాగంటే?
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఆగిపోయిన అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టింది. ఆ ప్రాంతంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండంలలోని 3 గ్రామాలు కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు కార్యాచరణ పున: ప్రారంభించింది. మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు. గతంలో ఇదే ప్రతిపాదనతో గ్రామసభలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించగా రాజధాని రైతులు అడ్డుకున్నారు.
Ranapala : అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం… రణపాల
కాగా, అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ఏర్పాటు కుట్రపూరితమైనదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన 29 గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామసభల్లో తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలపాలని నిర్ణయించారు. ప్రభుత్వం తమ అభిష్టానికి వ్యతిరేకంగా ముందుకెళితే హైకోర్టును ఆశ్రయిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.
రూ.2 లక్షల కోట్ల పైబడి విలువైన అమరావతి భూములను తాకట్టు పెట్టేందుకే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
అమరావతి పరిధిలో ఎకరా రూ.7 కోట్లు విలువ చేస్తుందని, 480 ఎకరాల తాకట్టుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసిందని టీడీపీ నేతలు చెప్పారు. రైతులు త్యాగం చేసిన 34 వేల ఎకరాల భూమి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే రూ.2లక్షల కోట్ల పైబడి ఉంటుందన్నారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
- YS Jagan Mohan Reddy : గవర్నర్తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ
- AP TDP: మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్లు వేసినంత తేలిక కాదు
- CM Jagan About Administration : 26జిల్లాలు ఎందుకో అందరికీ తెలియాలి, అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందాలి-సీఎం జగన్
- Dharmana Prasada Rao: ప్రభుత్వ పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం: ధర్మాన ప్రసాదరావు
- Andhra pradesh: వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి