ప్రియుడితో కల్సి భర్తను చంపేందుకు పక్కా స్కెచ్….కూతురు కాల్ రికార్డింగ్ తో బయటపడ్డ వైనం

  • Published By: murthy ,Published On : September 7, 2020 / 12:26 PM IST
ప్రియుడితో కల్సి భర్తను చంపేందుకు పక్కా స్కెచ్….కూతురు కాల్ రికార్డింగ్ తో  బయటపడ్డ వైనం

అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాల్లో చిచ్చురేపుకుంటున్నారు కొందరు. అందుకోసం ఎదుటి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు. వారిని హతమార్చేందుకు ప్రోఫెషనల్ కిల్లర్స్ కంటే దారుణమైన ప్లాన్ చేస్తున్నారు. అది టీవీ సీరియల్స్ ప్రభావమో మరేమో చెప్పలేముకానీ, వీరికి కొత్త కొత్త అయిడియాలు వస్తున్నాయి. స్లో పాయిజన్ ఇచ్చి భర్తను చంపాలనుకున్న మహిళ, ప్రియుడి ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.



తూర్పుగోదావరి జిల్లా మండపేట లో సతీష్ అనే వ్యక్తి గ్రామంలోని సంఘం కాలనీకి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇరువైపులా కుటుంబ సభ్యులకు తెలియకుండా గుట్టుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు ఇద్దరూ.
https://10tv.in/lover-kiss-the-bride-in-front-of-the-groom-karimnagar/
ఈవిషయం కొన్నాళ్లకు ఆమె భర్తకు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ నేపధ్యంలో తమ అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నభర్తనుతొలగించుకోటానికి ప్లాన్ చేశాడు. ఇందుకోసం తనస్నేహితుడు ప్రతాప్ ను సలహా అడిగాడు. అతని సలహా మేరకు ఆమె భర్తకు స్లోపాయిజన్ ఇచ్చి చంపాలని చెప్పాడు. ఈవిషయాన్ని ఆ మహిళకు చెప్పారు. అందుకు ఆమె కూడా ఓకే అంది. ఎలా హత్య చేయాలో ముగ్గురు స్కెచ్ వేసుకున్నారు.



తల్లి వ్యవహారంపై అనుమానం వచ్చిన మహిళ చిన్న కూతురు కొన్నాళ్లుగా తల్లిని గమనిస్తూ వస్తోంది. తల్లి స్మార్ట్ ఫోన్ లో ఆల్ కాల్ రికార్డింగ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసి తల్లి మాట్లాడే కాల్స్ అన్నీ వినటం మొదలెట్టింది. వాటిలో తండ్రిని హత్య చేయటానికి సతీష్ తో కల్సి తల్లి ప్లాన్ చేయటం విన్నది.

ఈవిషయం తండ్రికి చెప్పింది. కూతురు చెప్పిన విషయంవిని తండ్రి షాకయ్యాడు. వెంటనే మండపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. అతని ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు … కేసు నమోదు చేశారు. సతీష్ పైఐపీసీ 307,328ల కింద కేసు నమోదు చేసారు. హత్య కేసులో ప్రధాన పాత్రధారులైన సతీష్, ప్రతాప్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.