మంగళగిరిలో హిందీ టీచర్ ఆదృశ్యం – కోటి రూపాయలకు పైగా అప్పులు

మంగళగిరిలో హిందీ టీచర్ ఆదృశ్యం – కోటి రూపాయలకు పైగా అప్పులు

Mangalagiri Hindi Teacher Missing from Thursday : గుంటూరు జిల్లా మంగళగిరిలో నివసించే ప్రభుత్వ పాఠశాల కు చెందిన హిందీ ఉపాధ్యాయిని ఈనెల11వ తేదీన ఆదృశ్యమయ్యింది, స్ధానిక తెనాలి ఫ్లై ఓవర్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ ప్లాజా అపార్ట్ మెంట్ లో నివసించే దామర్ల ఝూన్సీరాణి(45) కనిపించటం  లేదని ఆమె భర్త వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ప్రతి రోజూ మాదిరిగానే ఈనెల 11వ తేదీ గురువారం ఉదయం ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లిన ఝాన్సీరాణి సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. ఆరోజు మధ్యాహ్నం సమయంలో వీరాంజనేయులు  తన భార్యతో ఫోన్ లోమాట్లాడారు.  ఇంటికి వచ్చిన కొద్దిసేపటి అనంతరం  ఆమె  సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయలుదేరి గాలిగోపురం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం పక్కన ఉన్న దుకాణం వద్ద తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి, తాళాలు ఆ దుకాణ యజమానికి ఇచ్చి, తన భర్త వచ్చి వాహనాన్ని తీసుకుంటారని చెప్పి ఎటో వెళ్ళిపోయింది.

రాత్రయినా భార్య ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్త వీరాంజనేయులు బంధువులను విచారించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.  దీంతో తన భార్య కనిపించటంలేదని వీరాంజనేయులు మంగళగిరి పోలీసులకు అదేరోజు రాత్రి ఫిర్యాదు చేశారు. ఝాన్సీరాణి   తుళ్లూరు మండలం మందడంలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

కాగా…. ఆమె స్ధానికంగా ఉన్న పలువురి వద్ద కోటి రూపాయలకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది.  ఆమె తన సెల్ ఫోన్ నుంచి కాకుండా వేరే ఫోన్ నెంబరు నుంచి బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు  పోలీసులు గుర్తించారు. త్వరలోనే ఝూన్సీరాణిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.