Nagababu : నారాయణకు కాస్త అన్నం పెట్టండి.. మెగా బ్రదర్ హాట్ ట్వీట్

తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నారు. అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.

Nagababu : నారాయణకు కాస్త అన్నం పెట్టండి.. మెగా బ్రదర్ హాట్ ట్వీట్

Nagababu

Nagababu : మెగా బ్రదర్ నాగబాబుకి తన తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి మీద ఈగ కూడా వాలనివ్వరు నాగబాబు. తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే.. వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చే వరకు నాగబాబు నిద్రపోడు అంటారు. తాజాగా ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది.

తన సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నారు. అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి అని ట్వీట్ చేశారు నాగబాబు.

“మన కుర్రాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే… ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలాకాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండుగడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే… దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు” అంటూ నాగబాటు ట్వీట్ చేశారు.

అంతకుముందు సీపీఐ నారాయణ…. ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభకు చిరంజీవిని పిలవడాన్ని తప్పుబట్టారు. సూపర్ స్టార్ కృష్ణ వంటి వ్యక్తిని పిలవకుండా ఊసరవెల్లిలాంటి, చిలర్ల బేరగాడు చిరంజీవిని వేదిక మీదకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. అటు, పవన్ కల్యాణ్ పైనా నారాయణ విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఓ మందుపాతర లాంటివాడని, ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదని అన్నారు. చిరంజీవి, పవన్ ను ఉద్దేశించిన నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి.