చిడతలు వాయించి డబ్బులు సంపాదించటం పవన్ కళ్యాణ్ కే చెల్లింది

చిడతలు వాయించి డబ్బులు సంపాదించటం పవన్ కళ్యాణ్ కే చెల్లింది

Minister Perni Nani counter to Janasena Chief Pawan Kalyan : ఈ భూ ప్రపంచంలో చిడతలు వాయించి డబ్బు సంపాదించటంచేతనైందంటే అది ఒక్క చిడతలనాయుడుకే చెల్లిందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న గుడివాడలో తన గురించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మంగళవారం ఘూటుగా స్పందించారు. తాను దివంగత సీఎంరాజశేఖర్ రెడ్డి భక్తుడనని….చచ్చిపోతూ కూడా రాజశేఖర్ రెడ్డి పేరు తలుచుకుంటూ చచ్చిపోతానని వ్యాఖ్యానించారు. జీవితాంతం ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉంటానని పవన్ కళ్యాణ్ లాగా డబ్బు కోసం అవసరమైన వాళ్లకు చిడతలు వాయించనని ఆయన అన్నారు.

రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్ మోహన్ రెడ్డికి భజన చేయటంలో నాకు స్వామి భక్తి ఉంది కానీ స్వార్ధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 2013లో హైటెక్స్ లో మీటింగ్ పెట్టి అభిమానులను విలేకరులను పిలిచి సోనియాగాంధీని తిట్టి…మోడీకి, చంద్రబాబు నాయుడుకు చిడతలు కొట్టి లాభం పొందిన చిడతలనాయుడు అని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు. 2014 నుంచి2017 దాకా చంద్రబాబుకు చిడతలు కొట్టాడని, అప్పడు మోడీ ఎవరో నాకు తెలీదన్నాని పవన కళ్యాణ్ ను విమర్శించారు. ప్రశ్నించటానికి పార్టీ పెట్టానని జనసేన స్ధాపించి ప్రశ్నించటం మర్చిపోయాడని అన్నారు.

2017 లో చంద్రబాబు పేమెంట్ ఇవ్వకపోవటంతో ఆయన్ను తిట్టటం మొదలెట్టాడని పేర్ని నాని అన్నారు. మళ్లీ చంద్రబాబు పేమెంట్ ఇచ్చేసరికి 2019 లో చంద్రబాబుకు చిడతలు కొట్టాడని… ఎన్నికల ముందు ఎర్ర జెండా లకు చిడతలు కొట్టావని.. ఎన్నికలవ్వగానే కాషాయ చిడతలు పట్టుకున్నావని ఆయన ఘాటుగా విమర్శించారు. నేను రాజశేఖర్ రెడ్డి కోసం స్వామి భక్తితో చిడతలు కొడతానని… మీలాగా డబ్బుల కోసం చిడతలు కొట్టనని ఆయన అన్నారు. వీళ్లందరూ సెట్టింగులు సినిమాల యవ్వారమని ప్రజలకు సినిమా చూపిస్తారని పవన్ కళ్యాణ్ ను అన్నారు. మంత్రి విలేకరుల సమావేశం జరుగుతున్నంతసేపు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా చిడతల నాయుడు అంటూనే సంబోధించారు.