Minister RK Roja : కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుంది.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీతో పిచ్చెక్కింది-మంత్రి రోజా ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతుందని, అందుకే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా దాన్ని రాద్దాంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Minister RK Roja : కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుంది.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీతో పిచ్చెక్కింది-మంత్రి రోజా ఫైర్

Minister RK Roja : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతుందని, అందుకే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా దాన్ని రాద్దాంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయినప్పటి నుంచి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు మంత్రి రోజా. ఆఖరికి బాలకృష్ణ ప్రారంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య రథంపై కనీసం తన ఫొటో కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదన్నారు.

Chandrababu challenge To Jagan : నేను కుప్పంలోనే ఉంటా..జగన్..పులివెందుల నుంచి రౌడీలను తెచ్చుకో అంటూ చంద్రబాబు సవాల్

”ప్రస్టేషన్ లో చంద్రబాబు చేస్తున్న కార్యక్రమం ఇది. ఎప్పుడెప్పుడు సీఎం జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేస్తున్నారో ఆయనకు మంచి పేరు వస్తున్న సమయం అంతా ఏదో ఒక విజన్ తో డైవర్ట్ చేయాలన్న చంద్రబాబు డ్రామాలు అంతా చూస్తున్నారు. మొన్నటివరకు ఒక ఫేక్ వీడియోతో నాటకాలు ఆడారు. నిన్న ఏ విధంగా వీధి నాటకాలు ఆడారో చూస్తున్నాం.

Chandrababu Security Increased : చంద్రబాబుకు భద్రత పెంపు.. 12 మంది ఎన్‌ఎస్జీ కమాండోలతో సెక్యూరిటీ

కుప్పంలో తన కోట కూలిపోతోందని భయపడుతున్నారు. ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎంపీపీ కార్యాలయం మీదకు దూసుకెళ్లి ఆ అమ్మాయిని కొట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూశాం. ఎప్పుడైతే అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ని కలిశారో అప్పటి నుంచి చంద్రబాబుకి ఏదేదో అయిపోయింది. బాలకృష్ణ ఆరోగ్యరథాన్ని ఏ విధంగా ప్రారంభించారతో అంతా చూశారు. అందులో ఎన్టీఆర్, బాలకృష్ణ ఫొటో తప్ప చంద్రబాబు ఫొటో లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపట్టినట్లు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. కచ్చితంగా చంద్రబాబుని పిచ్చాసుపత్రిలో చేర్చే రోజు దగ్గరలోనే ఉంది” అని మంత్రి రోజా అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw