Vizag : మిస్ వైజాగ్ కిరీటం కోసం 21 మంది పోటీ..చివరకు దక్కింది ఎవరికి ?
మిస్ వైజాగ్ కిరీట కోసం 21 మంది పోటీ పడ్డారు. చివరకు సృజిత కిరీటం దక్కించుకున్నారు. క్రియేటివ్ ప్లస్ ఆధ్వర్యంలో...ఆదివారం మిస్ వైజాగ్ గ్రాండ్ ఫైనల్ జరిగింది.
Miss Vizag 2021 : మిస్ వైజాగ్ కిరీట కోసం 21 మంది పోటీ పడ్డారు. చివరకు సృజిత కిరీటం దక్కించుకున్నారు. క్రియేటివ్ ప్లస్ ఆధ్వర్యంలో…ఆదివారం మిస్ వైజాగ్ గ్రాండ్ ఫైనల్ జరిగింది. ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతల వివరాలను మంగళవారం నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం 21 మంది మిస్ వైజాగ్ కిరీటం కోసం పోటీ పడినట్లు ఈవెంట్ నిర్వాహకులు అజయ్ తెలిపారు.
Read More : Girl Raped : అనంతపురంలో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
మొదటి రన్నర్ గా ముస్కాన్ సయ్యర్, ద్వితీయ రన్నరప్ గా చరిష్మా కృష్ణా నిలిచారని వెల్లడించారు. వివిధ విభాగాల్లో మరో 11 మందికి టైటిల్స్ అందచేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.
Read More : London : వ్యాన్ను జుట్టుతో లాగేసింది..నెటిజన్ల ట్రోలింగ్..ఏ షాంపు వాడుతున్నావు తల్లీ
మిస్ సోషల్ మీడియా క్వీన్గా పవిత్ర, మిస్ ఫొటోజెనిక్గా నేహా జమేలు, మిస్ గ్లోయింగ్ స్కిన్గా నేహా గుప్తా, మిస్ బ్యూటిఫుల్ హెయిర్గా సంధ్య, మిస్ ఫ్యాషన్ ఐకాన్గా ముస్కాన్ నయ్యర్, మిస్ బ్యూటిఫుల్ ఐస్ – పవిత్ర, మిస్ గ్లామరస్ క్వీన్ – రుచితారెడ్డి, మిస్ షైనింగ్ స్టార్ –చరిష్మా, మిస్ ఫర్ఫెక్ట్ ర్యాంప్ వాక్ – తారా, మిస్ గుడ్ నెస్ అంబాసిడర్ –బోర్నిటలకు టైటిల్స్ అందజేశారు.