MLA Sridhar Reddy : నారా లోకేష్, పల్లె రఘునాథ్ రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.

MLA Sridhar Reddy : నారా లోకేష్, పల్లె రఘునాథ్ రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

MLA Sridhar Reddy

MLA Sridhar Reddy : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత నారా లోకేష్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన ఇంటి పేరుతో సహా తనపై ఆరోపణలు చేస్తావా అంటూ మండిపడ్డారు. నియోజక వర్గంలో తన ఇంటిపేరుతో 5000 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వారందరితో కలిసి దోపిడీ కుంట అన్నందుకు గానూ నారా లోకేష్ పై కేసు వేయిస్తానని వెల్లడించారు.

అమరావతి పేరు చెప్పి దోపిడీ చేసింది మీరు రా.. అంటూ నారా లోకేశ్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు తమ రైతుల పొట్ట కొట్టి రెయిన్ గన్ ల పేరుతో 450 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అనవసరమైన నిందారోపణలు చేస్తే నేడు జరిగిన ఘటనలే పునరావృతం అవుతాయని హెచ్చరించారు.

Puttaparthi Politics : పుట్టపర్తిలో రాజుకున్న రాజకీయం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి సవాళ్లు.. ప్రతి సవాళ్లు

ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు. నాలుక కోస్తా అని మాట్లాడితే కత్తి తీసుకొని మీ ఇంటి వద్దకు వస్తా నాలుక కోయడానికి రా అని సవాల్ చేశారు. ఆంబోతులా రంకెలేస్తే తమ దగ్గర ఉన్న ముకుతాళ్లతో బిగించి కట్టేస్తామని చెప్పారు.