Konaseema Tension : కోనసీమలో విధ్వంసాలు సృష్టించవద్దు-పిల్లి సుభాష్ చంద్రబోస్

ప్రజల కోరిక మేరకే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని సంఘ విద్రోహకర శక్తులు అశాంతిని రేకేత్తించాయని అన్నారు. 

Konaseema Tension : కోనసీమలో విధ్వంసాలు సృష్టించవద్దు-పిల్లి సుభాష్ చంద్రబోస్

Pilli Bose

Konaseema Tension :  ప్రజల కోరిక మేరకే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని సంఘ విద్రోహకర శక్తులు అశాంతిని రేకేత్తించాయని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అంబేద్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు.  చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రావాలని ఆయన అన్నారు. వెనక ఉండి రెచ్చ గొటట్టం మానుకోవాలి అని ఆయన కోరారు. నాయకుల బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు అని పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు.

అంబేద్కర్ పేరు పెట్టుకోవటం మన అదృష్టం ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేద్కర్ వల్లనే మన దేశంలో ప్రజాస్వామం వర్ధిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్ లో రాజ్యాంగం ఫెయిల్ అయిందని సుభాష్ చంద్రబోస్ అన్నారు.

అదనపు బలగాలతో చేరుకున్న పోలీసులు అమలాపురంలో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకున్నారు.. పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధబాబు కూడా కాకినాడ నుంచి అదనపు బలగాలతో అమలాపురం చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read : Protestors Set Fire : రగులుతున్న అమలాపురం.. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు నిప్పు.. 3 బస్సులు దహనం