ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ పోలింగ్, కీలక ఘట్టం పూర్తి, ఓటర్ ఎటువైపు

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ పోలింగ్, కీలక ఘట్టం పూర్తి, ఓటర్ ఎటువైపు

AP

Municipal, Corporation : ఏపీలో మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్‌ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. 78 లక్షల 71 వేల 272 మంది ఓటర్లున్నారు.

75 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అవగా చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీల్లోని 16 వందల 34 వార్డుల్లో పోలింగ్‌ జరిగింది. 12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 7 వేల 552 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. హై కోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పోరేషన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్నా…. చివరకు పోలింగ్‌కు అనుమతి లభించింది.

పోలింగ్‌ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది. ఈనెల 14న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

మెజార్టీ స్థానాలు కైవశం చేసుకోవాలని అధికార ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేశాయ్‌. మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తే… టీడీపీ ఇతర పార్టీలు కూడా అదే స్థాయి ప్రచారంతో పోటీని తీవ్రం చేశారు. విజయంపై ఎవరి ధీమా వాళ్లకే ఉన్నా.. ఓటర్లు ఎటు మొగ్గుతారో అన్న టెన్షన్‌ కూడా అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. మిగిలిని మున్సిపాలిటీలు ఒకెత్తు.. విజయవాడ, గుంటూరు, విశాఖ ఒకెత్తు అన్నట్టు టీడీపీ, వైసీపీ ప్రచారం చేశాయ్‌. విశాఖపై ఉక్కుసెగ, కార్యనిర్వహక రాజధాని ప్రభావం ఉండగా.. విజయవాడ, గుంటూరుపై అమరావతి ఎఫెక్ట్ పడే అవకాశముంది. దీంతో విజయం ఎవరి పక్షం ఉంటుందన్న చర్చ సాగుతోంది.