టీడీపీ కచ్చితంగా అధికారంలోకి రాదు.. నాగబాబు జోస్యం

  • Published By: vamsi ,Published On : May 30, 2020 / 08:24 AM IST
టీడీపీ కచ్చితంగా అధికారంలోకి రాదు.. నాగబాబు జోస్యం

బాలయ్య మీద వ్యాఖ్యలతో ఒక్కసారిగా మళ్లీ వార్తల్లో నిలిచిన మెగా బ్రదర్, చిరంజీవి తమ్ముడు నాగబాబు.. మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తదుపరి ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని చెప్పిన ఆయన.. టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదంటూ జోస్యం చెప్పారు. 

అది తన నమ్మకమని, ఎందుకంటే తెలుగుదేశం తన హయాంలో రాష్ట్ర ప్రజలకు ఊడబొడిచింది ఏమీ లేదని విమర్శించారు. అభివృద్ధి అంతా టీవీ, పేపర్లలోనే కనిపించిందని, నిజానికి టీడీపీ చేసింది చాలా తక్కువ అని విమర్శించారు. 

ఏమీ చేయనందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలని నాగబాబు ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికలలో మళ్లీ మేమే వస్తాం అనే భ్రమల్లోంచి బయటపడాలని, మేము కలల్లోనే జీవిస్తాం అని అంటే చేసేదేమీ లేదన్నారు. ఇలాంటి పరిస్థితిని మానసికశాస్త్రంలో హెల్యూజినేషన్స్ అని అంటారని… ‘ఆల్ ది బెస్ట్ ఫర్ హెల్యూజినేషన్స్..’ అంటూ ట్వీట్ చేశారు నాగబాబు.

Read:  ఎందుకింత కాంట్రవర్సీ చేస్తున్నారు.. బాలయ్య, నాగబాబు వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఫైర్