Nandyala Constable Surendra Murder : హత్యకు ముందు.. ప్రాణభయంతో కానిస్టేబుల్ సురేంద్ర పరుగులు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

ఏపీలో సంచలనం రేపిన నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, హత్యకు ముందు.. రౌడీషీటర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో సురేంద్ర పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Nandyala Constable Surendra Murder : హత్యకు ముందు.. ప్రాణభయంతో కానిస్టేబుల్ సురేంద్ర పరుగులు.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

Nandyala Constable Surendra Murder : ఏపీలో సంచలనం రేపిన నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, హత్యకు ముందు.. రౌడీషీటర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో సురేంద్ర పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సురేంద్రను ఆటోలో తీసుకెళ్లి చెరువుకట్ట దగ్గర కత్తులతో పొడిచి దుండగులు హత్య చేశారు.

నంద్యాలలో పోలీస్‌ కానిస్టేబుల్‌ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్‌ను అటకాయించిన దుండగులు హత్య చేశారు. కానిస్టేబుల్‌ గూడూరు సురేంద్రకుమార్‌.. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. అయితే రాజ్ థియేటర్ సమీపంలో ఆరుగురు దుండగులు సురేంద్రను అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పట్టణ శివారులోని చెరువుకట్టపైకి తీసుకెళ్లారు. అక్కడ సురేంద్ర గుండెపై, వీపులో కత్తితో పొడిచి హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను ఆటోలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Anitha Reddy On Gorantla Madhav Video : గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ నేను కాదు-అనితా రెడ్డి

కానిస్టేబుల్ హత్యతో నంద్యాల ఉలిక్కిపడింది. జిల్లా‌ ఎస్పీ రఘువీర్ కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ.. అప్పటికప్పుడు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలోని ఫుటేజీ అధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Odisha: వృద్ధుడిని స్తంభానికి కట్టేసి.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

మృతుడు సురేంద్ర కొన్నాళ్లుగా నంద్యాల డీఎస్పీ అఫీసులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అఫీసులో మంచి ఉద్యోగిగా అందరి ప్రశంసలు పొందాడు. అలాంటి వ్యక్తిని దుండగులు హత్య చేయడం కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ హత్యతో నంద్యాల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా కానిస్టేబుల్ నే వెంటాడి మరీ కత్తులతో పొడిచి చంపితే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw