ఆంధ్రుల ఆత్మగౌరవం కేసీఆర్ కు తాకట్టు : లోకేష్

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్.. కేసీఆర్ కు తాకట్టు పెట్టారని నారా లోకేష్ చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 10:28 AM IST
ఆంధ్రుల ఆత్మగౌరవం కేసీఆర్ కు తాకట్టు : లోకేష్

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్.. కేసీఆర్ కు తాకట్టు పెట్టారని నారా లోకేష్ చెప్పారు.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్.. కేసీఆర్ కు తాకట్టు పెట్టారని నారా లోకేష్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. మోడీ మనకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. విభజన హామీలు ఇస్తానని నమ్మించి మోడీ మోసం చేశారని విమర్శించారు. ముమ్మిడివరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో లోకేష్ ప్రసంగించారు. జగన్ అడిషనల్ పేపర్లు తీసుకుని మరీ ఆయన మీదున్న కేసులు రాశారని ఆరోపించారు. 

రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. చంద్రన్న బీమా రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలో 120 సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అన్నా క్యాంటీన్ల లో రూ.5 లకే అన్న పెడుతున్నామని చెప్పారు. రంజాన్, క్రిస్మస్ కానుకలు అందించామని తెలిపారు. మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు.