Nara Lokesh Padayatra: రేపటి నుంచి నారా లోకేష్ పాదయాత్ర.. తొలిరోజు ఇలా..

టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్రను చేయబోతున్నారు. రేపు (శుక్రవారం) ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడుతుంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగుతుంది.

Nara Lokesh Padayatra: టీడీపీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్రను చేయబోతున్నారు. రేపు (శుక్రవారం) ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్ర సందర్భంగా గురువారం లోకేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లోనే లోకేష్ బస చేస్తారు. పాదయాత్ర శుక్రవారం ప్రారంభమవుతుంది.

Nara Lokesh Visited Tirumala : పాదయాత్ర జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్న నారా లోకేశ్

శుక్రవారం ఉదయం 10.15 గంటలకు కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి లోకేష్ బయలుదేరి స్థానిక వరదరాజుల స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం 4వేల కిలో మీటర్ల యువగళం పాదయాత్రలో భాగంగా ఉదయం 11.03 గంటలకు తొలి అడుగు వేస్తారు. అనంతరం కుప్పంలో మధ్యాహ్నం 3గంటలకు జరిగే యువగళం సభలో పాల్గొని లోకేష్ ప్రసంగిస్తారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ రోడ్డు మీదుగా రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.

Nara Lokesh: పాదయాత్రకు బయల్దేరే ముందు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేశ్

‘యువగళం’ పేరుతో చేపట్టే పాదయాత్రలో భాగంగా తొలిరోజు 8.5 కిలో మీటర్లు లోకేష్ నడుస్తారు. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ, కార్యకర్తలు, స్థానిక ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగుతారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలతో లోకేష్ మాట్లాడి, వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు.

ట్రెండింగ్ వార్తలు