Nara Lokesh: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అవినీతిలో తోపు: నారా లోకేశ్

టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని దోపిడీదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

Nara Lokesh: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో ఇవాళ నారా లోకేశ్ మాట్లాడుతూ… తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అభివృద్ధిలో వీక్, అవినీతిలో మాత్రం తోపేనని అన్నారు. “నిజానికి రాప్తాడు నియోజకవర్గానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఉంది. ఎమ్మెల్యే తండ్రి, సోదరులు, ఒక మహిళ ఇక్కడ దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు నా బనియన్లకు చిల్లులు పడ్డాయన్న చెప్పిన దోపిడీదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగేళ్ల కాలంలో రూ.1,000 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు” అని చెప్పారు.

“ఇద్దరు సీఐలను అడ్డంగా పెట్టుకుని రైతులు, రియల్టర్ల భూమిని దోచుకున్నారు. ఈ దోపిడీదుర్తి ప్రకాశ్ రెడ్డి విశాఖలో ఉన్న భూములను కూడా దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఒక అన్న కోటి రూపాయల భూమి ఆక్రమిస్తే మరొక అన్న రూ.30 కోట్ల విలువైన భూములు దోపిడీ చేశారు. పాదయాత్ర చేస్తుంటే తొమ్మిది టిప్పర్ల ఇసుక నా కళ్ల ఎదురుగా అక్రమంగా తరలి వెళ్లింది.

జాకీ కంపెనీని మేం తీసుకొస్తే వారి వద్ద రూ.17 కోట్లు డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఇక్కడ నుంచి తరలి వెళ్లి పోయింది. కియా కారును చూస్తే చంద్రబాబు గుర్తుకు వస్తారు. రాక్రీట్ కంపెనీ పేరుతో రూ.280 కోట్లు స్వాహా చేశాడు ఈ దోపిడీదుర్తి. రాప్తాడును కోనసీమ చేస్తానని హామీ ఇచ్చారు. నా పాదయాత్రలో ఎక్కడ కోనసీమ ఛాయలు కనపడలేదు.

రాప్తాడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మా తాత ఎన్టీఆర్ నుంచి మా ముద్దుల మామయ్య బాలయ్య వరకు అందరినీ ఈ జిల్లా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది” అని నారా లోకేశ్ చెప్పారు.

Manda Krishna Madiga: ఉండవల్లి శ్రీదేవికి అండగా నిలిచిన కృష్ణ మాదిగ.. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు