ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

  • Published By: sreehari ,Published On : November 25, 2020 / 06:49 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

AP Covid positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.



ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 60,726 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



వారిలో కొత్తగా 831 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,64,674లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.



కరోనా బారినపడి 6 మంది మరణించారు. 1,176 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 8,45,039 మంది డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 97,88,047 మందికి శాంపిల్స్ పరీక్షించగా 12,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.