ఏపీలో తగ్గుతున్న కరోనా : 24 గంటల్లో 199 కేసులు.. కోలుకున్నది 423 మంది

ఏపీలో తగ్గుతున్న కరోనా : 24 గంటల్లో 199 కేసులు.. కోలుకున్నది 423 మంది

Newly registered 199 corona cases in AP, one died : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒక్కరు మరణించారు. ఈ మేరకు శనివారం (జనవరి 9,2021) హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఒక్క రోజులో 50,445 శాంపిల్స్ పరీక్షించారు.

గడిచిన 24 గంటల్లో 423 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,22,74,647 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689కు చేరుకుంది.

నేటి వరకు కరోనా బారిన పడి మొత్తం 7,128 మంది మరణించారు. రాష్ట్రంలో 2,607 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,74,954 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.