పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’

పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’

Nota available in panchayat elections : ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 9,2021) ఉదయం 6.30 ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.

తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి, 20160 వార్డులకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్‌ను కేటాయించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, అనకాపల్లి, కాకినాడ, పెద్దాపురం, నరసాపురం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, కావలి, చిత్తూరు, కదిరి, నంద్యాల, కర్నూలు, కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగునున్నాయి.

శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎల్ఎన్ పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం.. కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లోని అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చయ్యపేట, చోడవరంలో మండలాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డివిజన్‌లో ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలిలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి.

కృష్ణా జిల్లా విజయవాడ రెవిన్యూ డివిజన్‌లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి.

గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపర, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడిలో ఎన్నికలు కొనసాగుతున్నాయి.

నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజన్‌లోని అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు లో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి.

కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్‌లలోని ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడులో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్‌లోని అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట, నల్లచెరువు, నల్లమాడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లులో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లలోని చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె.ఎన్, కలసపాడు, బి.మఠంలో ఎన్నికల పోలింగ్ సాగుతోంది.

చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లోని బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యాదమర్రిలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.