Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభం

Tirumala

pavitra utsavalu in Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేశారు. మ‌ధ్యాహ్నం 3 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిచ్చారు.

రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీటీ అద‌న‌పు ఈఓ ఏవీ ధ‌ర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ ర‌మేష్ బాబు, పేష్కార్ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.