KA Paul : తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మారుస్తా-కేఏ పాల్

తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.

KA Paul : తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మారుస్తా-కేఏ పాల్

Ka Paul

KA Paul :  తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ..శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే తో తనకు సన్నిహిత సంభందాలు ఉన్నాయని… ఆయనకు కుటుంబ పాలన వద్దని చెప్పాను అని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని పాల్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు.  భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ‌కు అప్పులు భారంగా మారనున్నాయని ఆయన తెలిపారు.  తెలంగాణాలో నేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం తోనే సరిపోతోందని…తెలుగు రాష్ట్రాలను రక్షించుకోలేక పోతే దేశాన్ని కూడా రక్షించుకోలేమని పాల్ చెప్పారు.

ఏపీకి ఏమి చేయని బీజేపీతో జనసేన పొత్తులు పెట్టుకుంటోందని…బీజేపీ, వైసీపీని ఏది అడిగితే అది కాదనకుండా చేస్తోందన్నారు. ఏపీలో ఎకనమిక్ సమిట్ పెట్టాలని మోదీని కలుద్దామంటే ఇక్కడి నేతలు కలసి రావటం లేదని పాల్ ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయ నేతలందరూ రాజీనామాలు చేసి నాతో కలిసి వస్తే అన్నీ సాధిస్తానని కేఏపాల్ ధీమా వ్యక్తం చేశారు.

ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పులు చేసి ఈ సీఎంకు ఇచ్చారు. సీఎం జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమి అడగటం లేదని పాల్ చెప్పారు. కొడుకుని సీఎంని చేసి తాను పీఎం కావాలని గత ఎన్నికల్లో చంద్రబాబు తిరిగారని… అలాగే ఇప్పుడు పీఎం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు.