ప్రకాశం జిల్లాలో క్షుద్రపూజల కలకలం……కత్తితో దాడి
man attacked victims knife : ప్రకాశం జిల్లా మార్టూరులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజలు చేసిన వ్యక్తి బాధితులపై మటన్ కత్తితో దాడి చేయటంతో బాధితుల్లో ఒకరు కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతుండగా మరో మహిళకు చేతి వేళ్లు తెగిపడ్డాయి.
మార్టూరు లోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో శుక్రవారం రాత్రి తమ ఇంటి ముందు సులేమాన్ కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించారని ఖాశీంవలి కుటుంబం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమపై ఫిర్యాదు చేశారనే కక్షతో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో సులేమాన్ కుటుంబం మటన్ కత్తితో ఖాశీంవలి పై హత్యాయత్నం చేయబోయాడు.
ఆ సమయంలో ఖాశీంవలి తల్లి కరీమూన్ తన కుమారుడి తలపై చేతులు అడ్డంపెట్టటంతో ఆమె ఎడమ చేతి రెండు వేళ్లు తెగిపోయాయి. కత్తి దెబ్బకు ఖాశీంవలి అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. కరీమూన్ ను మొదట మార్టూరుప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా … ఆమె పరిస్ధితి విషమించటంతో అక్కడి నుంచి ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఖాశీంవలి కోమాలో ఉన్నాడు. కరీంమూన్ కు ఎడమ చేతి చూపుడు వేలును వైద్యులు తొలగించినట్లు బంధువులు తెలిపారు. సులేమాన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసిస తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఖాశీంవలి భార్య సల్మాకోరుతోంది.