PM Modi: చిరస్మరణీయ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుంటున్నా..! ట్విటర్‌లో వీడియో పోస్టు చేసిన మోదీ

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

PM Modi: చిరస్మరణీయ కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుంటున్నా..! ట్విటర్‌లో వీడియో పోస్టు చేసిన మోదీ

Pm Modi (8)

PM Modi: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 30అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.

PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?

ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలోని పలు విశేషాలతో కూడిన ఫోటోలను వీడియో రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో నిన్న చిరస్మరణీయంగా జరిగిన కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ  కార్యక్రమ విశేషాలను మీతో పంచుకుంటున్నాను’ అంటూ మోదీ తెలిపారు.