టీడీపీకి షాక్..రాజ్యసభకు చెల్లని ఓట్లు వేసిన రెబల్ ఎమ్మెల్యేలు

టీడీపీ కి రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు చెల్లకుండా వేసారు.. 173 ఓట్లలో 4 చెల్లని ఓట్లు పడ్డాయి. రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీతో పాటు ఓ టీడీపీ ఎమ్మెల్యే ఓ చెల్లని ఓటు వేశారు. పార్టీ విప్ జారీ చేయటంతో … ఓటింగ్ లో పాల్గోనడంతో పాటు ఎవరికి ఓటు వేశారో ఏజెంట్ కు చూపాలి . టీడీపీ కి ఓటు వేసినా, ప్రాధాన్యతా స్ధానంలో టిక్ పెట్టారు రెబల్ ఎమ్మెల్యేలు దీంతో ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లకుండా ఓటు వేసిన సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం లేదు.