ఏపీకి వేల కోట్ల రూపాయలు తెస్తా : వర్మ సినిమా ఫ్లాప్..పిచ్చి సినిమా – పాల్
వర్మ సినిమా ఫ్లాప్..ఒక పిచ్చి సినిమా తీశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వర్మకు ముంబైలో సినిమాలు లేవు..ఇక్కడ లేవన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం స్కైప్లో మీడియాతో మాట్లాడారు. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే..ఇప్పటికైనా మారకుంటే..చరిత్ర హీనుడిగా మారిపోతారని సూచించారు. ఏపీకి త్వరలో వేల కోట్ల రూపాయలు తీసుకొస్తానని చెప్పారు కేఏ పాల్.
* ఇటీవలే వర్మ..అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో కేఏ పాల్తో కూడిన క్యారెక్టర్ ఉంది.
* అగౌరవపరిచేలా తన పాత్ర ఉందని ఈయన కోర్టు మెట్లు ఎక్కారు. సినిమా విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
* దీనిపై ఏర్పడిన రివైజింగ్ కమిటీ సినిమాను చూసింది. కొన్ని కట్స్తో యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.
* డిసెంబర్ 12వ తేదీన సినిమా రిలీజైంది.
* సినిమా ఆపడంపై వర్మ స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యారు.
* చిత్రాన్ని ఆపడానికి చాల మంది ట్రై చేశారు..దీనికి సంబంధించిన వివరాలను త్వరలో బయటపెట్టబోతున్నట్లు వర్మ ప్రకటించారు.
* ఇక కేఏ పాల్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు.
* 2019 ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు.
* ఎన్నికల్లో చాలా హడావుడిగా ప్రచారం నిర్వహించారు. వినూత్న ప్రచారశైలితో ఆయన ఆకర్షించే ప్రయత్నం చేశారు.
* తనన గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయలు విరాళాలు తీసుకొచ్చి ఏపీకి అమెరికా చేస్తానని పాల్ ఆనాడు ప్రకటించారు.
తాజాగా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై వర్మ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Read More : ‘రంగమార్తాండ’లో రాజశేఖర్ కూతురు