10 రోజుల్లోనే బియ్యం-పెన్షన్ కార్డు, 90రోజుల్లో ఇళ్ల పట్టాలు.. ఏపీలో సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక నిర్ణయం

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం కొత్త ఒరవడి తీసుకొచ్చింది. సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నిర్దిష్ట

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 12:20 PM IST
10 రోజుల్లోనే బియ్యం-పెన్షన్ కార్డు, 90రోజుల్లో ఇళ్ల పట్టాలు.. ఏపీలో సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక నిర్ణయం

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం కొత్త ఒరవడి తీసుకొచ్చింది. సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నిర్దిష్ట

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం కొత్త ఒరవడి తీసుకొచ్చింది. సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా సేవలు అందించే కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. అర్హులకు సకాలంలో సేవలు అందించలేక పోతే పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. సరైన కారణం లేకుండా ఏ దరఖాస్తునూ తిరస్కరించకూడదని సీఎం జగన్ చెప్పారు.

10 రోజుల్లో బియ్యం, పెన్షన్ కార్డు.. 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు:
అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తామనే కమిట్ మెంట్ పై సీఎం జగన్ సంతకం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ మంగళవారం(జూన్ 9,2020) అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, జెసిలు, ఇతర అధికారులతో మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న కొద్దిపాటి సమయంలోనే లబ్ధిదారులకు సంక్షేమాన్ని చేరువ చేయాలని అధికారులకు నిర్ధేశించారు. అలా చేయగలమనే నమ్మకంతో ఈరోజు ఒక విప్లవాత్మక నిర్ణయంకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ నిర్ణయం తీసుకునేప్పుడు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారని, ప్రజలకు ఎందుకు అంతగా కమిట్ మెంట్ ఇవ్వాలి, ఇస్తే చేయగలుగుతామో, లేదోనని సందేహం వ్యక్తం చేశారని సీఎం జగన్ తెలిపారు. 

ఓటు వేయకపోయినా అందరికీ సంక్షేమ పథకాలు:
ప్రజలకు మనం సంతృప్తస్థాయిలో.. పారదర్శకంగా… అవినీతి లేని, వివక్ష లేని వ్యవస్థను అందిస్తున్నప్పుడు..కచ్చితంగా కమిట్ మెంట్ ఇవ్వగలమని, అనుమానాలు వ్యక్తం చేసిన వారికి స్పష్టం చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు 44 లక్షల పెన్షన్లు వుంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 58 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వెయ్యి రూపాయిలే పెన్షన్ ఇచ్చేవారని, నేడు మనం దానిని రూ. 2250 ఇస్తున్నామని అన్నారు. సంతృప్తికర స్థాయి వరకు అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. బియ్యం కార్డుల విషయంలో కూడా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని, అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన పథకాలను సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 

* రాష్ట్రంలో 1.42 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశాం
* రాష్ట్రంలో ఎపిఎల్ తో కలుపుకుంటే.. మొత్తం ఇళ్లు 1.6 కోట్లు వరకు వుంటాయి
* 30 లక్షలకు పైగా అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం
* అంటే దాదాపు 20 శాతం వరకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం
* శాచ్యురేషన్ లెవల్ వరకు ఇస్తున్నాం కాబట్టి తరువాత వచ్చే దరఖాస్తులు కూడా తక్కువగానే వుంటాయని అభిప్రాయపడ్డ సీఎం
* ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకం సేవలు లభించకపోతే తరువాత వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. 

* గతంలో సంక్షేమ పథకాలు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. దానికి కూడా లంచాలు, రికమండేషన్లు అవసరమయ్యేవి
* దానికి భిన్నంగా నేడు అర్హత వుంటే చాలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవుతారు
* గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన
* జాబితాలో అర్హులైన వారి పేరు లేకపోతే… వారు ఎలా తిరిగి వారు దరఖాస్తు చేసుకోవాలో సూచికలను ఏర్పాటు చేస్తున్నాం
* పారదర్శకంగా… అవినీతి లేకుండా… అందరికీ పథకాలను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం
* మనకు ఓటు వేయని వారు అయినా సరే, వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలనేది మన లక్ష్యం
* 10 రోజుల్లో బియ్యం కార్డు, పెన్షన్ కార్డు ఇస్తామనే దానిపై సంతకం పెడుతున్నా
* 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు… 90 రోజుల్లో ఇళ్ళ పట్టా ఇస్తామనే కమిట్ మెంట్ పై సంతకం చేస్తున్నా
* నిర్ణీత సమయాల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హులు అని తేలితే.. వెంటనే ఖచ్చితంగా నిర్ధిష్ట గడువులోగా కార్డులు ఇవ్వాల్సిందేనని అధికారులకు సీఎం స్పష్టం 

కారణం లేకుండా దరఖాస్తులు తిరస్కరించొద్దు:
దీనిపై ఇప్పటికే జాయింట్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలను ఇచ్చామని, జిల్లాల్లో కలెక్టర్లు, జెసిలు దీనికి పూర్తి బాధ్యత వహించాలని సీఎం అన్నారు. కలెక్టర్లు గ్రామ సచివాలయాలకు వస్తున్న దరఖాస్తులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ… పర్యవేక్షించాలని, అర్హత వుంటే… కచ్చితంగా ఇన్ని రోజుల్లో సంక్షేమ పథకంను అందిస్తామనే నమ్మకం కలిగించాలని సీఎం జగన్ సూచించారు. పది రోజుల్లో నిర్ధిష్టమైన కారణం ఉంటేనే కార్డును నిరాకరించాలని, నిర్ధిష్ట కారణం లేకుండా కార్డు ఇవ్వకపోతే దానిని చాలా తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. జెసిలు, కలెక్టర్లు కచ్చితంగా దీనిపై మరింత శ్రద్ద తీసుకోవాలని, సరైన కారణం లేకుండా కార్డు నిరాకరిస్తే… దానికి తగిన పరిహారం కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న కమిట్ మెంట్ అని మరోసారి గుర్తు చేశారు సీఎం జగన్.

Read: సీఎం మీతో ఉన్నాడు, దూకుడుగానే ఉండండి… ఇసుక, మద్యం అక్రమ రవాణపై ఉక్కుపాదం