రెండోసారి కరోనా నెగెటివ్ రావడానికి కారణం ఇదే 

  • Published By: bheemraj ,Published On : June 25, 2020 / 08:15 PM IST
రెండోసారి కరోనా నెగెటివ్ రావడానికి కారణం ఇదే 

ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితత్వం 67 శాతం మాత్రమే వ్యక్తి శరీరంలో 33శాతం వైరస్ ఉనికి ఉన్నా నెగెటివ్ గా చూసిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి చేసిన కరోనా పరీక్షల ఫలితాల విషయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని చెప్పింది. దీపక్ రెడ్డికి కరోనా లేకపోయినా ఏపీలో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందంటూ టీడీపీ వాదిస్తోంది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ కూడా చేశారు. 

దీనిపై వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఇన్ ఫెక్టెడ్ వ్యక్తిలో వైరస్ 100 శాతం ఉంటే ఫలితాలు పాజిటివ్ గా నిర్ధారించవచ్చు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లే. ఎవరైనా ఇన్ ఫెక్టెడ్ రోగి చికిత్స చివర దశలో ఉన్నా నెగెటివ్ రావొచ్చు. దీపక్ రెడ్డి తొలి ఫలితాలు పాజిటివ్ గా వస్తే వంద శాతం ఇన్ఫెక్షన్ కు గురైనట్లే. 

రెండో విడత పరీక్షలో నెగెటివ్ రావడానికి కారణం ఉంది. ఆయనలో ఇన్ఫెక్షన్ స్ఠాయి 33శాతం లోపుగా ఉండటమే కారణం అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తొలుత దీపక్ రెడ్డికి చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు గుర్తించారు. అయితే ఆయన హైదరాబాద్ లో రెండుసార్లు పీసీఆర్ టెస్టులు చేయించుకోగా, నెగెటివ్ అని రావడం గమనార్హం.