Reliance: ప్రభుత్వ భూములు వెనక్కిచ్చిన రిలయన్స్
భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా టీడీపీ హయాంలో ఈ భూములను రిలయన్స్ కు కేటాయించారు అధికారులు.
Reliance: తిరుపతి సమీపంలో సెట్టాప్ బాక్సులు, ఇంటర్నెట్ వినియోగానికి అవసరమైన డాంగిల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు గతంలో రిలయాన్స్ సంస్థకు 136 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. అయితే తాజాగా ఆ సంస్థ ఈ భూములను వెనక్కు ఇచ్చేసింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో 50 ఎకరాలు వివాదంలో ఉంది.
ఈ భూములపై 15 మంది రైతులు కోర్టులో కేసులు వేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. ఈ కేసులు పరిష్కారం అయ్యేవరకు యూనిట్ ప్రారంభించడానికి అవకాశం లేదు. భూములు కేటాయించి ఇప్పటికే మూడేళ్లు దాటింది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ తాము తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ) తిరుపతికి సమీపంలోని వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు.
అయితే దీనికి సంస్థ ప్రతినిధుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. దీంతో రిలయన్స్ కంపెనీ తమ ప్రాజెక్టును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక భూములు వెన్నక్కు ఇచ్చిన విషయాన్నీ తిరుపతి ఏపీఐఐసీ జోనల్ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
భూముల కోసం రిలయన్స్ సంస్థ చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా టీడీపీ హయాంలో ఈ భూములను రిలయన్స్ కు కేటాయించారు అధికారులు.