corona cases : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…ఆ ఐదు జిల్లాల్లోనే అత్యధికంగా నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.

corona cases : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు…ఆ ఐదు జిల్లాల్లోనే అత్యధికంగా నమోదు

Ap Corona

Rising corona cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న రాష్ట్రంలో 1,288 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. అయితే నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లోనే నమోదవుతున్నాయి..

ప్రస్తుతం రాష్ట్రంలో 8 వేల815 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా కేసులు పెరగడంతో పాటు డిశ్చార్జి కేసులు తగ్గుతున్నాయి.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 51 లక్షల 46 వేల 104 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కేవలం ఐదు జిల్లాల్లోనే కేసుల సంఖ్య పెరగడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.. మొత్తం 1288 కోవిడ్‌ కేసుల్లో 1009 అంటే 78 శాతం కేసులు కేవలం 5 జిల్లాల్లోనే నమోదయ్యాయి.. దీంతో కరోనా కట్టడికి జిల్లా అధికారులు నడుం బిగించారు.. ఈ జిల్లాల్లోనే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? వాటి కట్టడికి తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? అన్న కోణంలో దృష్టి సారించారు.