అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఆటోను ఢీ కొట్టిన లారీ… 15 మంది కూలీలకు గాయాలు
Road accident in Anantapur : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
https://10tv.in/6-children-among-14-killed-in-road-accident-in-ups-pratapgarh/
గుత్తి మండలం తొండపాడు గ్రామం నుంచి కూలీ పని కోసం 15 మంది ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.