అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు సజీవ దహనం

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు సజీవ దహనం

Two burnt alive in Road accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ బస్టాప్ వద్ద ఓ బైకు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యాయి. మృతులిద్దరూ యాడికి మండలం భోగాల కట్టకు చెందినవారుగా గుర్తించారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.