New Year Day : ఏడాది మొదటి రోజు రక్తమోడిన రహదారులు.. విశాఖలో ముగ్గురు మృతి

విశాఖపట్నంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

New Year Day : ఏడాది మొదటి రోజు రక్తమోడిన రహదారులు.. విశాఖలో ముగ్గురు మృతి

Road Accident (2)

New Year Day : విశాఖపట్నంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రమాదాలు జరుగుతాయని ముందే గుర్తించిన పోలీసులు గత రాత్రి ఈ రోడ్డును మూసేసి ఉదయం ఓపెన్ చేశారు.

Also Read : Happy New Year: నగర వాసులకు హ్యాపీ న్యూ ఇయర్

ఈ ఉదయం వేగంగా వచ్చిన రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ఇక తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బైకుల వేగం 80కి పైనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు పోలీసులు.

Also Read :  Road Accident : న్యూ ఇయర్ చూడకుండానే నూరేళ్లు.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి