చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే.. సినీనటి రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స నిమిత్తం రోజా ఆసుపత్రిలో చేరినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా..

ROJA Surgery

ROJA Surgery:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే.. సినీనటి రోజా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స నిమిత్తం రోజా ఆసుపత్రిలో చేరినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు రోజాకు రెండు ఆపరేషన్‌లు జరిగినట్టుగా రోజా భర్త సెల్వమణి వెల్లడించారు.

రోజా ఆరోగ్య పరిస్తితి మీద ఆందోళన పడాల్సిందేమీ లేదని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లుగా సెల్వమణి ఓ ఆడియో విడుదల చేశారు. రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని, రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లుగా వెల్లడించారు.

అభిమానులు ఎవ్వరూ ఆసుపత్రికి రావద్దని, కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యాక ఆమెనే కలుస్తారని ఆడియోలో స్పష్టం చేశారు సెల్వమణి. ఐసీయూ నుంచి సోమవారం ఉదయం వార్డుకు తరలించారని, ఇదివరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉండగా.. గతేడాది కరోనా కారణంగా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.

మరోసారి జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా వేసుకోగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది.