కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. రూ.72.50 లక్షలు సీజ్

కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. రూ.72.50 లక్షలు సీజ్

Rs 72.50 lakh seized : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద రూ.72.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ నగదు దొరికింది.

అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. కర్నాటకకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.