సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 05:49 AM IST
సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అబ్బాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. బాధితులను గోరంట్లలోని ఆర్కే వీధికి చెందిన గ్రామ వాలంటీర్ వేణు, సచివాలయ ఉద్యోగిని ఉషగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే కారణం అని కొందరు చెబుతున్నారు. ఇంట్లో వాళ్లు వారి ప్రేమను అంగీకరించలేదని, అందుకే సూసైడ్ అటెంప్ట్ చేశారని అంటున్నారు.

See Also | టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం.. కారణం ఇదే

ఉష మాత్రం మరోలా చెబుతోంది. కొద్దిరోజులుగా గ్రామ వాలంటీర్ వేణు ప్రేమిస్తున్నానంటూ తన వెంటపడుతున్నాడని వాపోయింది. తాను మాత్రం తిరస్కరించానంది. వాలంటీర్ తనతో మాట్లాడాలని పిలిపించాడంది. తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగిన వేణు.. బలవంతంగా తన నోట్లో పోశాడని ఉష ఆరోపించింది. అపస్మారక స్థితిలో ఉన్న వేణు, ఉషను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఉషను అడిగి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. వేణు స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అన్నారు. పూర్తి విచారణ తర్వాత నిజం ఏంటో చెబుతామన్నారు.