Sambashivarao : ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్ట్
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
AP fiber net case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఇప్పటికే సాంబశివరావుతో పాటు హరిప్రసాద్ను సీఐడీ విచారించింది. గత ప్రభుత్వ హయాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా సాంబశివరావు పని చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు.
టెర్రా సాఫ్ట్ కంపెనీకి సాంబశివరావు నిబంధనలకి విరుద్దంగా టెండర్లు కట్టబెట్టినట్లు సీఐడీ గుర్తించింది. ఫైబర్ నెట్లోని తొలి ఫేజులో 320 కోట్ల టెండర్లలో 121 కోట్ల అవినీతిని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ-2గా సాంబశివరావులపై కేసు నమోదైంది.
Minister Sucharitha : గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్తున్నాడు : హోంమంత్రి సుచరిత
గత నాలుగైదు రోజులుగా వేమూరితో పాటు సాంబశివరావును కూడా సీఐడీ పలుమార్లు విచారించింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్కి టెండర్లు దక్కేలా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.