విద్యార్థులకు కరోనా, కర్నూలు జిల్లాలో స్కూల్ మూసివేత

కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు.

విద్యార్థులకు కరోనా, కర్నూలు జిల్లాలో స్కూల్ మూసివేత

school closed in kurnool district due to corona: కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు. రెండు రోజలు క్రితం స్కూల్ లో చదివే ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని నిన్న(మార్చి 15,2021) ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో యాజమాన్యం ఇవాళ(మార్చి 16,2021) నుంచి పాఠశాల మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బడిలో 400 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఏపీలో గడిచిన 24 గంటల్లో 147 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు వచ్చాయి. 22వేల 604 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా, 0.65 శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు.

అటు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 15 మందికి కరోనా సోకింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయులు, ఓ విద్యార్థికి కొవిడ్‌ సోకింది.